మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి రోజా

Jan 1, 2023, 3:42 PM IST

మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా నూతన సంవత్సరాది రోజున మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని  దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి స్వామివారి దర్శనం, పూజలు చేయించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందించి మంత్రి రోజాను ఆశీర్వదించారు అర్చకులు. 

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... రాష్ట్రంలో పర్యాటక శాఖ  ఇతర రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. చారిత్రాత్మక కట్టడాలు పరిరక్షణ  కోసం దృష్టి సారించామని... అందులో భాగంగానే మంగళగిరి టూరిజం ప్యాకేజీ కింద అభివృద్ది చేస్తామన్నారు. అలాగే అమరావతి బుద్దిస్ట్ సెంటర్ ప్రాంతాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తామని రోజా అన్నారు.