తెలంగాణకు నష్టం జరిగే పనులు జగన్ చేయరు.. మంత్రి అనిల్ కుమార్

May 11, 2020, 5:58 PM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  తెలంగాణకి నష్టం జరిగే ఏ పనులు చేయరని నెల్లూరు లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కృష్ణ నీటి వాడుకలో రెండు రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని పార్టీలు కృష్ణా నీటిని వివాదం చేయాలని చూస్తున్నాయన్నారు. ఏపీ, తెలంగాణ ల సీఎంలు అన్నదమ్ముల లాగా కలిసి ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి రైతులను రెచ్చగొట్టాలని అని చూస్తే చూస్తే ఊరుకోం హెచ్చరించారు.