ఏటి నీరు కలుషితం.. కుప్పలు, తెప్పలుగా చచ్చిపోతున్న చేపలు..

Jun 13, 2020, 4:14 PM IST

విశాఖ జిల్లా, మునగపాక మండలంలో ఉన్న గవర్ల అనకాపల్లి ఆవ ఖండం ఏటి నీరు కలుషితం అవ్వడంతో ఏటిలోని మత్స్య సంపద మొత్తం చచ్చిపోయింది. పరవాడ ఫార్మాసిటీ వ్యర్ధాలను నీటిలోకి వదిలేయడం వల్లే మత్స్య సంపద చచ్చిపోయిందని, ఈ నీటినే పంటపొలాలకు వినియోగిస్తామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజీ నీరు కూడా ఈ ఏటిలోకే వస్తోందని  రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేపలు చచ్చిపోయి మూడు రోజులైనా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదన్నారు.