భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని.. హై వోల్టేజీ విద్యుత్ స్తంభం ఎక్కి..

Jun 30, 2020, 11:21 AM IST

విశాఖ, గోపాలపట్నంలో భార్య అలిగిందని భర్త ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెడితే సింహాచలం రైల్వేస్టేషన్‌లో రైల్వే పట్టాలపై ఉన్న హైవోల్టేజీ విద్యుత్తు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి చనిపోతానని హల్‌చల్‌ చేశాడు. 
సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు, దువ్వాడ రైల్వే పోలీసులు వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపేసి అతడ్ని కిందికి దింపారు. విషయం ఆరా తీయగా భార్య అలిగి పుట్టింటికి పోయిందని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.