పట్టపగలే... షాప్ యజమానిపై దుండగుడి పిడిగుద్దులు

Jun 27, 2021, 5:59 PM IST


గన్నవరం ఆర్టిసి బస్టాండ్ లో ఓ షాప్ యజమాని పసుపు లేటి సీతారామయ్యపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. పట్టపగలు ప్రయాణికులందరూ చూస్తుండగానే దుండగుడు షాప్ యజమానిపై పిడిగుద్దులు కురిపించాడు. అతడి నుండి తప్పించుకుని పారిపోయినా వెంటపడి మరీ దాడిచేశారు.  
 
ఈ దాడిపై షాప్ యజమాని మాట్లాడుతూ... డిపో మేనేజర్ నాగభూషణమే ఈ దాడి చేయించాడని ఆరోపించారు. అన్ని అనుమతులతో బస్ స్టాండ్ లో వ్యాపారం నిర్వహిస్తున్నా మామూళ్లు ఇవ్వాలని డిపో మేనేజర్ డిమాండ్ చేస్తూ పలు మార్లు గొడవ పడ్డారని ఆరోపించాడు. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే మామూళ్లు కట్టాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని... కట్టనుందుకే తనపై దాడి చేయించాడని ఆవేదన  వ్యక్తం చేశారు.