కంటెయినర్ లారీ పార్కింగ్ చేస్తుంటే ఎగిసిన మంటలు.. ఒకరికి తీవ్రగాయాలు..

Jul 16, 2020, 4:19 PM IST

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటి వలసలో అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద కంటైనర్ లారీ ని రోడ్డు ప్రక్కన పార్కింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో లారీలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.