AP Capital Crisis : రాజధానిలో భారీగా మోహరించిన మహిళా హోం గార్డులు... పాదయాత్రకు అంతా సిద్ధం...

Jan 10, 2020, 12:50 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతినుండి మార్చే విషయంలో జరుగుతున్న రాజధాని రైతుల ఆందోళన ఇవ్వాళ్టికి 24వ రోజుకు చేరుకుంది. శుక్రవారం జేఎసీ ఆధ్వర్యంలో రాజధాని రైతులు విజయవాడకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో మహిళ హోమ్ గార్డులు భారీగా దిగారు. కరకట్టమీదికి రైతులు దూసుకురాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. కరకట్టమీదికి వాహనాలను అనుమతించడం లేదు.