దాచేపల్లి నూతన ఛైర్ పర్సన్ గా సుబ్బమ్మ ప్రమాణస్వీకారం...

Feb 3, 2023, 5:12 PM IST

పల్నాడు : దాచేపల్లి నగర పంచాయితీ మాజీ ఛైర్ పర్సన్ రమాదేవి మృతిచెందడంతో ఆ స్థానంలో  కొప్పల సుబ్బమ్మ నియమితులయ్యారు. ఇవాళ దాచేపల్లి పంచాయితీ కార్యాలయంలో గురజాల ఆర్డివో అద్దయ్య అద్యక్షతన నూతన ఛైర్ పర్సన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసు మహేష్ రెడ్డి నూతన ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సుబ్బమ్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దాచేపల్లి అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన ఛైర్ పర్సన్ సుబ్బమ్మ తెలిపారు.