శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Jan 17, 2020, 11:36 AM IST

శ్రీశైలంలో 5వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పుష్పపల్లకిలో పూజాదికాలను అందుకొని భక్తులకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి  దర్శనమిచ్చారు. కన్నుల పండువగా గ్రామోత్సవం జరిగింది. కర్నూల్ జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహోత్సవాలల్లో భాగంగా ఈరోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి పుష్పపల్లకిసేవను ఎంతో కన్నుల పండువగా గ్రామోత్సవాన్ని ఈఓ. కేస్. రామారావ్ ఎంతో వైభవంగా నిర్వహించారు. సుమారు 500 కేజీలకు పైగా పలురకాల పుష్పాలు, 4,500  అలంకార విడి పుష్పాలు  750 మీటర్లకు పైగా విడి మాలలు వినియోగించి పుష్ప పల్లకి తయారుచేశారు.