అరకు వ్యాలీలో దంచికొట్టిన వాన.. పొంగిన వాగులు, వంకలు...

Jul 3, 2020, 11:43 AM IST

విశాఖపట్నం జిల్లా  అరకు లోయలో కుండ పోత వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వాగులు గడ్డలు పొంగి ప్రవహించాయి. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి  మండల కేంద్రానికి వచ్చిన గిరిజన పనులు ముగించుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి గడ్డలో పొంగి ప్రవహించడంతో సుమారు మూడు నాలుగు గంటల పాటు ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు  కాగా వర్షపు నీటితో పంట పొలాలు నిండిపోవడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేశారు.