Apr 25, 2021, 10:58 AM IST
విశాఖపట్నంలో మరో టిడిపి నేతకు చెందిన భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) అధికారాలు తెల్లవారుజామున గంటలు నుండి కుల్చివేత చేపట్టారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కి చెందిన బిల్డింగ్ను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. గాజువాకలోని ఈ బిల్డింగ్ ను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.
విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పల్లా శ్రీనివాసరావు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఎలా కూల్చివేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ కూల్చివేతలు కక్ష సాధింపుచర్యల్లో భాగమేనని ఆరోపించారు. దీనిపై సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా భారీగా పోలీసులు మోహరించారు.