ఏపీలో గ్రూప్-1 పరీక్ష ప్రారంభం... ఎగ్జామ్స్ సెంటర్ వద్ద ఇదీ పరిస్థితి...

Jan 8, 2023, 12:10 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ స్థాయి ఉన్నత ఉద్యోగాల కోసం ఏపిపిఎస్సీ ద్వారా 92 గ్రూప్-1 పోస్టుల నియామకాన్ని చేపట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తదితర ప్రక్రియలు ముగియడంతో ఇవాళ (జనవరి 8 ఆదివారం) ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని  ఏజిఎస్జి కళాశాలలో గ్రూప్‌-1 పరీక్షా కేంద్రం ఏర్పాటుచేసారు. పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఏపిపిఎస్సీ అధికారులు తెలిపారు.