Apr 13, 2021, 10:07 AM IST
తిరుపతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఆశయాలు నెరవేరాలని, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా లోకేష్ తిరుపతి లో కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.