చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Aug 30, 2020, 1:21 PM IST

చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం బలిజ పల్లె గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక వైపు నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొన్నది.  ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే నలుగురు మృతి చెందారు.  మొదట ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు,అనంతరం టిప్పర్‌ను ఢీ కొన్నది.