Cyclone Asani Effect : తెలుగురాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన పూలధరలు

May 14, 2022, 11:27 AM IST

అమరావతి: ఆసనీ తుఫాను ప్రభావంతో పూల దిగుబడి భారీగా తగ్గడం... పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ భారీగా పెరగడంతో తెలుగురాష్ట్రాల్లో పూలధరలు హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పూలకు మంచి గిరాకీ వుండటంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితంవరకు కేవలం 200 రూపాయలు ఉన్న కేజీ పూల ధర ప్రస్తుతం 600 రూపాయలకు పెరిగింది. దీంతో సామాన్యులు పూలు కొనాలి అంటే హడలిపోతున్నారు.