కాల్పుల మోతతో ఉలిక్కిపడ్డ మన్యం.. ఎదురుకాల్పుల్లో గాయపడ్డ మావోలు..

Jul 20, 2020, 5:33 PM IST

ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లా ఏజెన్సీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివారం భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో  రెక్కీ నిర్వహించిన పోలీసులకు లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రితోపాటు, రక్తం మరకలు కనిపించాయని, గాయపడినవారు లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తామని DSPరాజకమల్ తెలిపారు.