కడప రైతుల ఆగ్రహం.. కూరగాయలు రోడ్ల మీద పారబోసి నిరసన..

May 6, 2020, 1:56 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేల్‌లో రైతులు కూరగాయలు రోడ్ల మీద పడేసి నిరసన తెలుపుతున్నారు. కూరగాయలు అమ్ముకోవడానికి నిన్నటివరకు అనుమతి ఇచ్చి ఇవ్వాళ రావొద్దంటున్నారని వాపోతున్నారు. మార్కెట్ వచ్చాక అనుమతి లేదంటే ఎక్కడికి పోవాలి... ఇప్పుడీ పంటంతా ఏం చేసుకోవాలంటూ రోడ్డుమీద పారబోశారు.  రైతుల సమస్యలను ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.