Farmers March To Vijayawada : రోడ్లపై ఫెన్సింగులు, 144 సెక్షన్లు..పోలీసుల తీరుపై రైతుల ఆగ్రహం...

Jan 10, 2020, 12:26 PM IST

గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ చెప్పకుండా ఇప్పటికిప్పుడు 144 సెక్షన్ అంటే ఎట్లా అంటూ ఓ యువకుడు పోలీసులతో వాదనకు దిగాడు దీంతో తుళ్లూరులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొండపాడులో రాకపోకలు లేకుండా రోడ్డుమీద పోలీసులు ఫెన్సింగ్ వేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండలో చలపతి కాలేజ్ విద్యార్థులు రోడ్డుపై నిరసన తెలిపారు.