సవాంగ్ దుస్థితే వారికికూడా... సిఐడి సునీల్ కు ఏ గతి పడుతుందో..: మాజీ మంత్రి జవహర్

Feb 17, 2022, 2:08 PM IST

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించకుండా కేవలం తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. వాటాల విషయంలో విభేదాలు వచ్చి అడిగిన దానికంటే ఎక్కువ పనిచేసిన డిజిపి గౌతమ్ సవాంగ్ నే బదిలీ చేసారు... జగన్ ని నమ్ముకుంటే మిగతా అధికారులకు కూడా ఇదే దుస్థితి పట్టనుందని హెచ్చరించారు. ప్రవీణ్ ప్రకాష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, గౌతమ్ సవాంగ్ పని అయిపోయింది...  ఇక రాబోయే రోజుల్లో సీఐడి అధికారి సునీల్ కుమార్ కు ఏ గతి పడుతుందో చూడాలని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.