వైఎస్ సన్నిహితుడితో జగన్ కు కొత్త చిక్కులు.. మారుతున్న గన్నవరం సమీకరణాలు..

Aug 6, 2020, 5:01 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తాజాగా గన్నవరం నియోజకవర్గ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ ని వీడి అనధికారికంగా వైసీపీలో చేరడంతో సహజంగానే ఆ నియోజకవర్గ విషయాలపై ఆసక్తి అధికమయ్యింది. ఇప్పుడు తాజాగా అక్కడ వైసీపీలో వంశీకి ఎదురవుతున్న ఇబ్బందులతో... అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.