ప్రభుత్వ వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు...ప్రస్తుతానికి 11 ఔట్లెట్ లలో మాత్రమే...

Feb 4, 2023, 9:27 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని 11 మద్యం ఔట్లెట్ లలో మాత్రమే ఈ డిజిటల్ పేమేంట్స్ అనుమతించనున్నారు. మిగిలిన మద్యం దుకాణాల్లో వారం రోజుల్లో డిజిటల్ పేమెంట్లకు అనుమతివ్వనున్నారు. ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ మద్యం షాపుల్లో ఆన్ లైన్ చెల్లింపులను ప్రారంభించారు. Digital payments starts in AP Liquor shops