రైతుల కన్నీళ్లకు నువ్వే కారణం : సీఎం జగన్ పై చంద్రబాబు నాయుడు ఫైర్

May 4, 2023, 4:45 PM IST

రాష్ట్రంలో అకాల వర్షం వాళ్ళ దెబ్బతిన్నపంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఉంగుటూరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భముగా రైతులనుద్దేశించి మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. "గతంలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు సీఎం కదా పర్యటించి ప్రజల కష్టాలు తీర్చాల్సింది అన్నావు, ఇప్పుడు అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు " అంటూ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు.