ట్రంప్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం బైక్ ర్యాలీ

Feb 25, 2020, 3:55 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు భారత్ పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో సిపిఎం బైక్ ర్యాలీ చేపట్టింది. స్థానిక జగదాంబ సెంటర్ నుండి పూర్ణమార్కెట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు . ప్రపంచ శాంతి వర్థిలాలి , ట్రంప్ గోబ్యాక్ అని ప్లకార్డు ప్రదర్శిస్తూ , నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు . ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ యుద్ధ మనిషి అయిన ట్రంప్‌తో ఒప్పందం అంటే వాడి పాపంలో మనం భాగస్వాములం అయిన్నట్టేనని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో ఒప్పందం వల్ల మన రైతాంగం , రక్షణ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని ప్రజలు గమనించాలన్నారు.