రోజూ ఈ వాటర్ తాగితే.. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఇక ఉండదు..!

First Published May 1, 2024, 1:19 PM IST

పప్పులో ఉన్న అన్ని పోషకాలు ఈ నీటితో మనకు అందుతాయి. అంతేకాకుండా... మన రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడానికి, వాటి పనితీరు మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది.


ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్ గా పప్పు వండుతూనే ఉంటాం. నార్మల్ కంది పప్పు వండినప్పుడు పెద్దగా నీరు మిగలకపోవచ్చు. కానీ... శెనగపప్పు, పెసరపప్పు లాంటివి ఉడకపెట్టినప్పుడు  ఎక్కువ నీరు పోసి ఉడకపెడతాం. ఉడికిన తర్వాత ఆ నీటిని వంపేసి పారబోస్తూ ఉంటాం. కానీ.. ఆ నీటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలిస్తే.. ఇంకోసారి ఆ నీటిని మనం పారబోయం. 
 

Moong Dal

సాధారణంగానే పప్పు లో చాలా పోషకాలు ఉంటాయి.  ఒక చిన్న గిన్నెడు పప్పులో మనకు 32 శాతం ఫైబర్ అందుతుంది. అంతేకాదు... ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫోలేట్, ఐరన్ లాంటివి కూడా అందుతాయి. మన శరీరంలో కొలిస్ట్రాల్  లెవల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు రెగ్యులర్ గా పప్పు తినడం వల్ల డయాబెటిక్స్, కొలన్ క్యాన్సర్ లాంటివి మన దరి చేరకుండా కూడా ఉంటాయి. ఇలాంటి ఉపయోగాలు ఉన్న పప్పులను ఉడకపెట్టి ఆ నీరు తాగడం వల్ల కూడా అంతకు మించి ఉపయోగాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు.

పప్పులో ఉన్న అన్ని పోషకాలు ఈ నీటితో మనకు అందుతాయి. అంతేకాకుండా... మన రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడానికి, వాటి పనితీరు మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది.  రోజూ పప్పు వండుకోకపోయినా ఈ పప్పు వాటర్ చేసుకొని  తాగొచ్చు. ముఖ్యంగా పిల్లలకు తాగిస్తే..చాలా బలంగా, ఆరోగ్యంగా ఉంటారట. మరి.. ఆ పప్పు వాటర్ ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..
 

 ముందుగా అరకప్పు కందిపప్పు తీసుకోవాలి. దానిని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఈ పప్పును వాటర్ పోసి, ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో ఉడికించాలి. కనీసం ఐదు విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఈ పప్పు నుంచి వాటర్ వేరు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్  ని  నెయ్యి వేసి, వెల్లుల్లి వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే మ్యాజికల్ వాటర్ రెడీ అయిపోయినట్లే. ఆ వాటర్ లో కొద్దిగా ఇంగు వేసకుంటే సరిపోతుంది.
 


ఈ పప్పు వాటర్ లో ఇంగువ వేయడం వల్ల అరుగుదల సమస్యలు రావు. కంది పప్పు మాత్రమే కాదు.. శెనగలు,మినపప్పు వంటి వాటితో కూడా తయారు చేసుకోవచ్చు.  ఈ వాటర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలను  పూర్తిగా తగ్గించేస్తాయి.


ఈ పప్పు వాటర్ లో ఇంగువ వేయడం వల్ల అరుగుదల సమస్యలు రావు. కంది పప్పు మాత్రమే కాదు.. శెనగలు,మినపప్పు వంటి వాటితో కూడా తయారు చేసుకోవచ్చు.  ఈ వాటర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలను  పూర్తిగా తగ్గించేస్తాయి.

ఇక పోపులో వెల్లుల్లి చేర్చడం వల్ల.. యాంటీ ఇన్ఫమేటరీ ప్రాపర్టీలు లభిస్తాయి. ఇవి.. బాడీలో వాపును తగ్గిస్తాయి.  మన హెల్తీ సిస్టమ్ ని చక్కగా మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.  ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బలపరుస్తుంది.
 

ఈ పప్పు వాటర్ ని  సూప్ లాగా చేసుకొని తాగొచ్చు. లేదు అంటే ఏవైనా కర్రీల్లోనూ చేర్చవచ్చు. రుచిని పెంచుతుంది. మీరు నమ్మరు కానీ.. బేకింగ్ కి కూడా సహాయపడుతుంది. మీరు బ్రెడ్ తయారు చేయడానికి పిండి కలుపుతున్నప్పుడు.. దాంట్లో ఈ పప్పు వాటర్ మిక్స్ చేస్తే సరిపోతుంది.  ప్యాన్ కేక్, పేస్ట్రీస, మఫిన్స్ ఏది తయారు చేస్తున్నా.. దాంట్లో పోపు వేయని పప్పు వాటర్ కలుపుకోవచ్చు.  చిన్న పిల్లలకు సైతం ఈ పప్పు వాటర్ తాగించవచ్చు. 

click me!