కరోనా ఎఫెక్ట్ : తిరుమలకు వెళ్లే దారులు బంద్...

Mar 20, 2020, 10:38 AM IST

కరోనా వైరస్ అలర్ట్‌తో తిరుమలకు వెళ్లే రహదారులు మూసివేశారు. అలిపిరి చెక్‌పోస్ట్ మూసివేశారు. వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. అలిపిరి కాలినడక దారిలోనూ, శ్రీవారి మెట్టు మార్గంలో కూడా భక్తుల్ని అనుమతించడం లేదు. దీంతో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూతపడ్డాయి. కొండపైన వున్నభక్తులను కూడా క్రిందికి పంపిస్తున్నారు.