పెన్షన్ల పంపిణీలో గందరగోళం..జగన్ ను తిట్టిపోస్తున్న జనం...

Feb 2, 2020, 12:25 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు లో ఇంటింటికి పెన్షన్ పథకం పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది. ఇంటికి రావాల్సిన వాలంటీర్లు రాకపోవడంతే ఉదయం 5 నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద,  జై కిసాన్ పార్కులో గంటల తరబడి పెన్షన్ దారులు వేచిఉన్నారు. ఇంటింటికి అని చెప్పి ఇప్పుడు ఇలా తిప్పించుకుంటున్నారు అంటూ వృద్ధులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.