ఏపీ సామాజిక-ఆర్థిక సర్వే 2022-23 విడుదల చేసిన సీఎం జగన్...

Mar 15, 2023, 1:17 PM IST

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ సామాజిక-ఆర్ధికసర్వే 2022-23 నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ జవహర్ రెడ్డి తదితరులతో కలిసి ఈ సర్వే నివేదికను జగన్ విడుదల చేసారు. గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే ఏపీ వృద్దిరేటు 16.22 శాతం పెరిగినట్లుగా ఈ సర్వేలో పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో  16.36 శాతం, సేవారంగంలో 18.91 శాతం వృద్ధిరేటు సాధించినట్లుగా పేర్కొన్నారు. గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగినట్లుగా పేర్కొన్నారు.