AP MLC Polling : ఓటుహక్కు వినియోగించుకున్న సీఎం జగన్

Mar 23, 2023, 10:32 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ అవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బలం లేకున్నా అనూహ్యంగా టిడిపి బరిలోకి దిగడంతో పోలింగ్ అనివార్యమయ్యింది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది.