వైసీపీలో వర్గవిభేదాలు : తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి చేసిన ఎమ్మెల్యే వేణు అనుచరులు

Feb 20, 2020, 12:38 PM IST

తూర్పుగోదావరి, రామచంద్రాపురంలో వైసిపి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన వై.వి సుబ్బారెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే, అమలాపురం వైసిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులుపై ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు వర్గానికి చెందిన ఇజ్రాయేలు చెప్పుతో దాడి చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ తోటను సముదాయించారు.