Nara Bhuvaneshwari : అమరావతి ఉద్యమానికి చేతి గాజులు ఇచ్చిన భువనేశ్వరి

Jan 1, 2020, 2:59 PM IST

అమరావతి ప్రజల తర్వాతే కుటుంబాన్ని తన భర్త పట్టించుకొనేవారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి చెప్పారు. రాజధానిని అమరావతిలోనే
కొనసాగించాలని కోరుతూ ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షలో చంద్రబాబుతో కలిసి భువనేశ్వరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరీ రైతులతో మాట్లాడారు. అమరావతి
ఉద్యమానికి విరాళంగా తన చేతికి ఉన్న బంగారు గాజును ఇచ్చారు. ఆ గాజును బహిరంగ వేలం వేసి, ఆ డబ్బును ఉద్యమానికి వినియోగించాలని చంద్రబాబు కోరారు.