Chalo Amaravathi : ఉద్దండరాయునిపాలెంలో నేలను ముద్దాడిన చంద్రబాబు

Nov 28, 2019, 1:32 PM IST

ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియజేస్తానంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయడు అమరావతి పర్యటనకు బయలు దేరారు. ఉద్దండరాయునిపాలెం చేరుకున్న చంద్రబాబు నాయుడు రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశానికి చేరుకున్నారు. శంకుస్థాపన ప్రదేశంలో పర్యటించి, అక్కడి నేలను ముద్దాడారు.