విశాఖ గ్యాస్ లీకేజీ : జగన్ నిర్ణయం కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపింది.. కానీ.. అంటున్న కన్నా

May 8, 2020, 2:08 PM IST

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. దీనినుండి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందన్నారు. గ్యాస్ లీకేజీ నియంత్రణ కు అవసరమైన యాంటీ డాట్ ను గుజరాత్ నుండి పంపించారని తెలిపారు.  ఇది మానవ తప్పిదం వలన జరిగిన ఘటన. ఈ ఘటనపై హై కోర్టు సిటింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అభినందనీయమని జగన్ ను మెచ్చుకున్నారు.