Rashmi Gautam
రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలన్న విషయం తెలిసిందే. ఆమె జీవహింసను వ్యతిరేకిస్తారు. మూగజీవాలను ఆహారం కోసం లేదా, ఇతర కారణాలతో హింసిస్తే ఆమె తట్టుకోలేరు. జంతువుల రక్షణ కోసం ఆమె చాలా కాలంగా పోరాటం చేస్తుంది.
photo credit- rashmi Instagram
జీవులను ఏ రూపంలో కూడా ఇబ్బందులకు గురి చేయకూడదని నమ్మే రష్మీ వీగన్ గా మారింది. ఆమె మాంసాహారమే కాదు... పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు కూడా తినరు. అయితే మూగ జీవాలను సపోర్ట్ చేస్తూ రష్మీ చేసే సోషల్ మీడియా కామెంట్స్ ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి.
Rashmi Gautam
గత ఏడాది హైదరాబాద్ లో ఒక బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఈ ఘటనలో బాలుడు తల్లిదండ్రులదే తప్పని రష్మీ గౌతమ్ వాదించింది. దాంతో రష్మీని దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే బక్రీద్ పండగకు జరిగే గోవధను కూడా ఆమె వ్యతిరేకించడం వివాదాస్పదం అయ్యింది.
తాజాగా రష్మీ గౌతమ్ ఓ వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతున్న వీడియో షేర్ చేసింది. ఇది దారుణం అంటూ వాపోయింది. మనం ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపలేకపోతన్నామని ఆమె ప్రశ్నించారు. ఈ పోస్ట్ పై ఓ నెటిజెన్ స్పందించారు.
ఆడపిల్లను రేప్ చేస్తున్నారు. బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. చంపేస్తున్నారు. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి... అని కామెంట్ చేశాడు.
ఈ కామెంట్ పై స్పందించిన రష్మీ గౌతమ్... ఇవాళ ఎద్దును చంపిన వాడు రేపు మీ పిల్లలను చంపుతాడు. వాడికి మనిషికి పశువుకు తేడా తెలియదు బ్రెయిన్ వాడు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. రష్మీ గౌతమ్ సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.