న్యూడ్ నెట్టెడ్ క్రీమీ గౌన్ లో 'దేవర' బ్యూటీ, చూడ్డానికి రెండు కళ్లూ చాలవు

First Published May 7, 2024, 7:39 AM IST

ఒక వైపు సినిమాల్లో వరుసగా నటిస్తూ మరో వైపు అందాల ఆరబోత చేస్తుంది. . గతంలో కూడా  జాహ్నవి అందాల ఆరబోత చేసింది కానీ ఈ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఫోటోలు ఇవే
 

 


ఇన్ స్టా వేదిక‌గా  నిరంత‌రం షో స్టాప‌ర్ గా నిలవటం అంటే మామూలు విషయం కాదు. అయితే ఆ విషయంలో పండిపోయింది జాహ్నవి కపూర్. ఇటీవల జాహ్నవి తాజా ఫోటోషూట్ నుండి రేర్ క్లిక్స్ ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవి ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. న్యూడ్ నెట్టెడ్ క్రీమీ గౌన్ లో జాహ్నవి అందాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
 

 
 ధడక్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్‌.  అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాహ్నవి కపూర్‌ చిత్రసీమకు పరిచయం కావటంతో ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. వాస్తవానికి సినీ పరిశ్రమకు వారసులు కొత్త కాదు. వారసుల చిత్రాలపై ఉండే ఆసక్తీ కొత్త కాదు. అయితే శ్రీదేవి కుమార్తె సినిమాల్లోకి వస్తోందనగానే ఇంతకుముందెన్నడూ లేని ఆసక్తి నెలకొంది.  ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ అంచనాలను సొగసైన అందంతో, సాటిలేని అభినయంతో  నిలబెట్టుకుంది జాన్వీ.


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో ప్రక్క తన సినిమాలకు, కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటారు జాన్వీ. ఇలాంటి వార్తలతో అప్పుడప్పుడూ జాహ్నవి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తెలుగులోనూ ఆమె వరస సినిమాలు కమిట్ అవుతోంది.


ఈ క్రమంలో అప్పుడప్పుడూ ఇలా గ్లామర్ ప్రదర్శనకు ఆమె తెర తీస్తోంది. కస్టమ్ మేడ్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో మినిట్ వర్క్‌తో కూడిన క్లిష్టమైన డిటైలింగ్‌ను ధరించి, న్యూడ్ నెట్టెడ్ గౌనులో అద్భుతంగా కనిపిస్తోంది.


తన గ్లామర్ తో నటించి మెప్పించిన అతిలోక సుందరి శ్రీదేవి. బాలనటిగా తన ప్రస్ధానం మొదలు పెట్టిన ఆమె సీనియర్ నటులతో నటించింది. ఆ తర్వాత తరం నటులతో నటించి మెప్పించింది.  తెలుగు, తమిళలలో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా టాప్ హీరోయిన్ అనిపించుకుంది.  అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది వీరికి జాన్వీ, ఖుషి కపూర్ కూతుళ్లు ఉన్నారు. జాన్వీ ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేసింది. తల్లికు తగ్గ తనయ అనిపించుకుంది. అంతేకాదు తన గ్లామర్ పోజులతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.  

జాన్వీకపూర్ 'ధడక్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటిగా తనేంటో ప్రపంచానికి తెలిపింది. ఈ సినిమా విజయం సాధించటంతో ఈ అమ్మడుకి బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ముఖ్యంగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడంతో జాన్విపై కెమెరా కన్నులన్నీ ఆమెపైనే ఉంటాయి. ఆమె ఎక్కడికి వెళ్లినా కెమెరాలు బిజీ అయ్యిపోతూంటాయి. వాళ్లకు ఆ అవకాసం ఇచ్చేటట్లే ఆమె మసలుకుంటున్నట్లు అనిపిస్తుంది.

కెరీర్ ప్రారంభం నుంచీ జాన్వీ కపూర్ వెబ్ లో మీడియాకు బాగా ఇంట్రస్టింగ్ పర్సన్ గా మారిపోయింది. ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూండటంతో వాటినే ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో జాన్వీ కపూర్ కు ఉన్న డిమాండే వేరు. ఒక్క సినిమా కూడా చెయ్యకముందే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అది తల్లి నుంచి వచ్చిన వారసత్వం, తండ్రి నిర్మాత కావటం, పెద్ద పెద్ద పరిచయాలు కారణం కావచ్చు. అయితేనేం అలా ఏర్పడిన ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ అవటం మాత్రం కాస్త కష్టమైన పనే.

కెరీర్ మొదలెట్టక ముందే ఓ వర్గం మీడియా...వారసత్వం ఎంతవరకూ రాణిస్తుందంటూ కథలు రాసేసింది. జాన్వీ కేవలం వారసురాలే..అంతకు మించి ఆమెకు సీన్ లేదు...ఏదో గ్లామర్ తో కొట్టుకురాలి, తల్లి పోలికలతో గుర్తింపు తెచ్చుకోవాలి అంటూ విమర్శలు అందుకున్న ఆమె  తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకుంది.

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ గా ప్రారంభమై, ఇప్పుడు తనకంటూ క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది. పిట్ట కొంచెం, కూత ఘనం తరహాలో ఆమె తెరపై దుమ్ము రేపుతోంది.

అంతేకాదు తెర వెనక కూడా ఆమె ఎప్పటికప్పుడు మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.  తాజాగా ఆమె లుక్స్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఆ మధ్యన ఆమె జిమ్ వెళ్తున్నప్పుడు తీసే ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో  తెలుగులో ఫుల్‌ బిజీగా ఉంది జాన్వీ కపూర్‌. ఈ క్రమంలో  సౌత్‌లో జాన్వీ బిజీ అవ్వటానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  త్వరలో  ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమా లో కూడా ఆమె హీరోయిన్ గా చేయనుంది.

తెలుగులో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీలో నటిస్తున్న  జాన్వీ కపూర్.. త్వరలోనే రామ్ చరణ్ తోనూ జత కట్టనుంది. నేషనల్ అవార్డు విన్నర్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చరణ్ చేస్తున్న మూవీలో జాన్వీనే హీరోయిన్. తల్లిలాగ సౌత్ లోనూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఉందిట.
 


"నా కూతురు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేసింది. అందులో ఆమె గడిపిన ప్రతి క్షణాన్ని జాన్వీ ఆస్వాదించింది. త్వరలోనే రామ్ చరణ్ తోనూ సినిమా చేయబోతోంది. తారక్, చరణ్ చాలా బాగా నటిస్తున్నారు. ఆమె ఈ మధ్య చాలా తెలుగు సినిమాలు చూస్తోంది. వాళ్లతో కలిసి పని చేయడం తన అదృష్టంగా ఆమె భావిస్తోంది. ఆ సినిమాలు బాగా ఆడతాయని అనుకుంటున్నాను. ఆమెకు అక్కడ మరిన్ని అవకాశాలు రావాలి. అంతేకాదు తమిళంలో సూర్యతోనూ నటించబోతోంది. నా భార్య (శ్రీదేవి) వివిధ భాషల్లో నటించింది. నా కూతురు కూడా అదే చేస్తోంది" అని బోనీకపూర్ అన్నాడు.

ఆ మధ్య  పూరీ సినిమాలో నటించమని జాహ్నవిని అడిగింది చార్మి అన్న వార్తలు మీడియాలో  వచ్చాయి. కానీ ఈ విషయాన్ని డీల్‌ చేసింది పూరీ జగన్నాథ్‌ అంటోంది బాలీవుడ్‌ మీడియా. తన సినిమాలో జాహ్నవి నటించడానికి ఒప్పించమని పూరీనే స్వయంగా బోనీకపూర్‌ని అడిగారట! కానీ దానికి బోనీకపూర్‌ నో చెప్పారని అంటున్నారు. టాలీవుడ్‌లో జాహ్నవి నటించడం బోనీకపూర్‌కి అంతగా నచ్చలేదట! అందుకే పూరీకి నో చెప్పారట!  

భవిష్యత్తులో పెద్ద దర్శకుల వద్ద చేస్తే చేస్తుందని బోనీ అన్నారనే విషయం విశ్లేషిస్తే... పెద్ద దర్శకులంటే బోనీ దృష్టిలో ఎవరన్నది ఇప్పుడు అందరి ప్రశ్న. బహుశా రాజమౌళిలాంటి దర్శకులను దృష్టిలో పెట్టుకునే బోనీకపూర్‌ అలా అని ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి
 

Janhvi Kapoor

మొదటి నుంచి సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ వచ్చింది సామాన్యమైన కుటుంబం నుంచి కాదు...అయినా కూడా ట్రెండ్ కి తగ్గట్టు ఫ్యాషన్ గా ఉంటూ దుమ్ము రేపుతోంది
 

click me!