ఆత్మకూరు ఉపన్నికల్లో అలజడి... పోలీసులతో ఇండిపెండెంట్ అభ్యర్థి వాగ్వాదం

Jun 23, 2022, 12:40 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో భాగంగా ఇవాళ (గురువారం) పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద అలజడి రేగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇండిపెండెంట్ అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి ఆరోపించారు. వైసీపి నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ఉండి ప్రచారం చేస్తున్నా ఎందుకు పట్టించుకోకపోవడం లేదంటూ పోలీసులతో శశిధర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులు అతడికి సర్దిచెప్పి పోలింగ్ కేంద్రం వద్దనుండి పంపించారు.