యాంకర్ శ్యామల చీకటి బాగోతం బయటపెడతా... సంచలనం రేపుతున్న మహిళా నేత కామెంట్స్ 

First Published May 6, 2024, 2:49 PM IST

యాంకర్ శ్యామల ఇటీవల ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె వైసీపీ పార్టీ తరపున ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. శ్యామల వైసీపీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో టీడీపీ మహిళా నేత ఘాటు వ్యాఖ్యలు చేసింది. 
 

syamala

ఏపీలో ఎన్నికల హీట్ కొనసాగుతుంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తమ అభిమాన నాయకులు , పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు. యాంకర్ శ్యామల వైసీపీ పార్టీలో చేరారు. ఆమె కొన్ని నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 
 

Lokesh

పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం సైతం శ్యామల వెళ్లారు. అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వంగ గీతను కలిశారు. ఆమెకి మద్దతుగా ఎన్నిలకల ప్రచారంలో పాల్గొన్నారు. వంగ గీతకు ఓటు వ్యయాలని అభ్యర్ధించారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఏపీ పాలిటిక్స్ పై స్పందించారు. 
 

Lokesh

కాగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి శ్యామల చేసిన కామెంట్స్ ని టీడీపీ మహిళా నేత ఉండవల్లి అనూష తప్పుబట్టింది. శ్యామల పై ఘాటైన కామెంట్స్ చేసింది. నీ చీకటి బాగోతం బయటపెడతానని ఉండవల్లి అనూష సీరియస్ అలిగేషన్స్ చేసింది. 
 

Undavalli Anusha

ఉండవల్లి అనూష మాట్లాడుతూ... గతంలో శ్యామల షర్మిల తెలంగాణాలో ఏర్పాటు చేసిన పార్టీలో చేరారు. ఆమె పార్టీ ఎత్తేయడంతో కుల పిచ్చితో ఆంధ్రాకు వచ్చి వైఎస్సార్సీపీలో చేరింది. అసలు ఆంధ్రాలో శ్యామలకు ఏం పని. నోరు విప్పితే మేము కూడా కొన్ని నిజాలు మాట్లాడగలం. 
 

Anchor Syamala

ఆంధ్రలో ఉన్నది మేము, నష్టపోయింది మేము, భరిస్తుంది మేము. తల్లిని, చెల్లిని అడ్డం పెట్టుకొని జగన్ అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అతన్ని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు నోరుంది. మేము అనర్గళంగా మాట్లాడగలం. యాంకరింగ్, సినిమా ఫంక్షన్స్ చేసుకునే నీకు రాజకీయాలు ఎందుకు?
 

Anchor Syamala

అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. నీ భర్త చేసిన ఘోరాలు, నీ చీకటి బాగోతం బయటపెడతాను. నీకు లాగా కథలు కాదు నిజాలు చెబుతాం... అని ఆమె అన్నారు. మరి ఉండవల్లి అనూష కామెంట్స్ కి శ్యామల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి...

click me!