స్థానిక సంస్థల ఎన్నికలు : కలిసి పోటీ చేయనున్న బీజేపీ, జనసేన

Mar 9, 2020, 11:08 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పయనిస్తాయని విజయవాడలో జరిగిన జనసేన, బిజెపి సంయుక్త సమావేశంలో దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వైసిపి ఎన్నికలకు‌ వెళుతుందన్నారు. బిజెపి, జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఎపికి నిధులు ఇచ్చింది.