భీమ్లా నాయక్ కోసం... తెలంగాణ బాటపట్టిన పవన్ అభిమానులు

Feb 24, 2022, 5:41 PM IST

అమరావతి: తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు అభిమానులు తెలంగాణ బాట పట్టారు. రేపే(శుక్రవారం) భీమ్లా నాయక్ విడుదల కానుండగా ఇప్పటికీ  టికెట్లు విక్రయాలు ప్రారంభంకాలేదు. అలాగే బెనిఫిట్ షోలకు అనుమతివ్వకపోవడమే కాదు టికెట్ రేట్లను పెంచుకోడానికి జగన్ సర్కార్ అనుమతివ్వలేదు. ఇలా పవన్ కల్యాణ్ సినిమాకు ప్రభుత్వం అడ్డుంకులు సృష్టిస్తుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన కొందరు అభిమానులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు బయలుదేరారు.