చిరు వ్యాపారులకు జగనన్న తోడు... రూ.395 కోట్లు విడుదల

Jan 11, 2023, 2:27 PM IST

అమరావతి : చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారికి అండగా నిలిచేందుకు వైసిపి ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. పదివేల చొప్పున మొత్తం రూ.395 కోట్ల రుణాలు అందించనున్నామని... ఈ నిధులను ఒక్క బటన్ నొక్కి విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో రుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన 3 లక్షల 67 వేల మందితో పాటు మరో 28 వేలమందికి కొత్తగా ఈ పథకం కింద వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.