గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కు రాగి జావ... ప్రారంభించిన సీఎం జగన్

Mar 21, 2023, 5:06 PM IST

తాడేపల్లి :ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మద్యతరగతి విద్యార్థులకు బలవర్ధకమైన రాగి జావ అందించే కార్యక్రమాన్ని ఆంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తోంది జగన్ సర్కార్. తాజాగా ఈ గోరుముద్ద పథకం ద్వారా అందించే ఆహార పదార్థాల్లో రాగిజావ చేరింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం ద్వారా సీఎం జగన్ రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.