వరద బాధితుల పరామర్శకు వెళ్లి... ఉద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం జగన్

Dec 3, 2021, 5:04 PM IST

తిరుపతి: వరద బాధితుల పరామర్శ కోసం తిరుపతి వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు. సీఎంను పీఆర్సీ గురించి కొందరు ఉద్యోగులు ప్రశ్నించగా వారిని దగ్గరకు పిలుచుకున్న సీఎం పదిరోజుల్లో పీఆర్సీపై ప్రకటన వుంటుందని తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియ పూర్తైందని సీఎం జగన్ ఉద్యోగులకు తెలిపారు.