Jan 7, 2020, 1:32 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి చేశారు. రాజధాని పరిరక్షణ సమితి జేఎసీ ఆధ్వర్యంలో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చారు.