ఈ నెల పదహారునుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆ నిర్ణయంతో చంద్రబాబుకు షాక్...

Jun 11, 2020, 4:02 PM IST

అమరావతిలో ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చ జరిగింది. అమరావతిలో జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనున్న ప్రభుత్వం. వచ్చే ఆగస్టు 12న పధకం ప్రారంభించనున్న సీఎం జగన్. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కెబినెట్ లో చర్చవిభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకి కేంద్రం 
నిధులివ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డ కెబినెట్. కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని కెబినెట్ నిర్ణయం.