Jan 20, 2020, 12:07 PM IST
అమరావతి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని ఐకాసా, జేఏసీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రుల, సభ్యుల కాన్వాయ్ కి రక్షణగా స్ట్రైకింగ్ ఫోర్స్ పోలీసు వాహనాలు ఏర్పాటు చేశారు.