మహా పాదయాత్రపై రాళ్ల దాడి చేసే అవకాశాలున్నాయని సమాచారం.. నిర్వాహకుల ఆందోళన..

Sep 23, 2022, 1:47 PM IST

అమరావతి : నేటి నుంచి మూడు రోజులపాటు హై టెన్షన్ మధ్య అమరావతి మహా పాదయాత్ర జరగుతోంది. పెడన,గుడివాడ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. రైతుల మహా పాదయాత్రపై రాళ్లతో దాడి చేసే అవకాశం ఉందని పాదయాత్ర కమిటీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు అనుగుణంగా తమకు భద్రత ఏర్పాట్లు కల్పించాలని పాదయాత్ర నిర్వాహకులు కోరుతున్నారు.