69వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు

Feb 24, 2020, 4:56 PM IST

రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 69వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా రైతులు రాయపూడి సీడ్ యాక్సిస్ నుండి వెంకటపాలెం వరకు మానవహారం నిర్వహించారు . ఈ సందర్భంగా హైకోర్టుకు వెళ్లే న్యాయమూర్తులకు , న్యాయవాదులకు ప్లకార్డులు, మౌన ప్రదర్శనతో రైతులు నిరసన తెలిపారు.