Jun 27, 2022, 11:18 AM IST
విజయవాడ: స్వాతంత్ర్య సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జగన్ సర్కార్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే అల్లూరి జయంతి (జూలై 4)కి వారంరోజుల ముందునుండే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ బందరు రోడ్డులో 125 అడుగుల జాతీయ జెండా విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ... 75 సంవత్సరాల అజాదీకా అమృత్ మహోత్సవ్ భాగంగా అల్లూరి 125వ జయంతిని జరుపుకుంటున్నామన్నారు. అల్లూరి 27ఏళ్లకే గూడెంలోని రైతులను ఏకం చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించారని గుర్తుచేసారు. అల్లూరి జయంతి సందర్భంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహస్తున్నామన్నారు. దేశాభిమానంతో ఉన్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు కలెక్టర్ డిల్లీ రావు.