నాకు కాదు ఆయనకు థ్యాంక్స్ చెప్పండి : నారా లోకేష్

Jan 23, 2020, 1:17 PM IST

మూడురాజధానుల బిల్లును మండలిలో విజయవంతంగా అడ్డుకున్నారు. జై అమరావతి నినాదాలతో లోకేష్ సభను దద్దరిల్లేలా చేశారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లాలని తీర్మానించిన అనంతరం మందడంలో రాజధాని రైతులను లోకేష్ కలిశారు. వారితో కలిసి కొద్దిదూరం నడిచి వెళ్లారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.  తనకు ధన్యవాదాలు తెలిపిన ప్రజలను ఉద్దేశించి నారా లోకేష్ తనకు కాదు, మండలి చైర్మన్ కు ధన్యావాదాలు తెలపాలని చెప్పారు.