తెలంగాణలో చెలరేగిపోతున్న డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు తెలంగాణ జెఎసి నడుం బిగించింది.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టుదాం!
యువత ఉజ్వల భవిష్యత్తును కాపాడుదాం!!
అనే నినాదాలతో హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనుంది జెఎసి. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నది. మంగళవారం ఉదయం 10 గంటలకు దిల్ సుఖ్ నగర్ బస్సు స్టాండ్(రాజీవ్ చౌక్ ) నుండి రైస్ మిల్లర్ అసోసియేషన్ బిల్డింగ్ వరకు ఈ ర్యాలీ జరపనున్నారు జెఎసి నేతలు.
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాను అరికట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని జెఎసి అనుమానం వ్యక్తం చేస్తోంది. సర్కారు కఠిన చర్యలు తీసుకునేలా వత్తిడి పెంచేందుకు కూడా తమ ర్యాలీ ఉపయోగపడుతుందని జెఎసి నేతలు అంటున్నారు.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టుదాం! యువత ఉజ్వల భవిష్యత్తును కాపాడుదాం!! -తెలంగాణ జేఏసీ. రేపు ఉదయం 10 గంటలకు దిల్ సుఖ్ నగర్ బస్సు స్టాండ్(రాజీవ్ చౌక్ ) నుండి రైస్ మిల్లర్ అసోసియేషన్ బిల్డింగ్ వరకు.