Dec 13, 2018, 3:20 PM IST
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను నూతనంగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని ఎంపి ఆఫీస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. సిహెచ్. మల్లారెడ్డి, బొల్లెం మల్లయ్య యాదవ్, చందర్ రావు, కాలేరు వెంకటేష్, కంచర్ల భూపాల్ రెడ్డి, సీహెచ్. క్రాంతి కిరణ్, రవీంద్ర నాయక్, నన్నపనేని నరేందర్, పువ్వాడ అజయ్, భిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, షకీల్ ఆమిర్, కే. విద్యాసాగర్ రావు, కొప్పుల ఈశ్వర్ లు తమ గెలుపుకు కృషి చేసిన ఎంపి కవితకు కృతజ్ఞత లు తెలిపారు. వీరితో పాటు టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, వేముల వీరేశం, గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్ర శేఖర్ గౌడ్, ఈగ గంగారెడ్డి, గిర్థావర్ గంగారెడ్డి, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ఎంపి కవితను కలిశారు. ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా ఎంపి కవిత శుభాకాంక్షలు తెలిపారు.